Photo by Feodor Chistyakov on Unsplash
మానవుడికి కావలసినవి ముఖ్యంగా మూడే విషయాలు: కూడు,గూడు,గుడ్డ. వాటిని సంపాదించుకోవటానికి చేసే పనే మన “వృత్తి.” ఆదిమానవులుగా ఉండే కాలంలో తనకు కావాల్సిన తిండిని వేటాడి సమకూర్చుకునేవాడు. అదే మానవుడి మొదటి వృత్తిగా పరిగణించచ్చు. జీతం లేకుండా ఏకంగా తిండినే సంపాదించుకునే వాడు. పచ్చి మాంసం తినేవాడు అనుకోకుండా ఒకరోజు, నిప్పులో పడి బాగా వండబడిన మాంసం తిన్నాడు. పచ్చిదాని కంటే కాల్చబడ్డది తిన్న మానవుడికి బుర్ర ఎదగటం మొదలయ్యింది. ఇప్పుడు అదే వినాశనానికి కారణం అవుతుంది.
బుర్ర ఎదిగిన మానవుడు ఒక చోట ఆగలేదు. పంటలు పండించచ్చు అని తెలుసుకున్నాడు,బట్టలు వేసుకోవచ్చు అని కనుగొన్నాడు. అవి మానవాభివృద్ధికి ఎంతో సహాయపడినవి. కానీ మనిషి ఎదుగుదల ఆగలేదు, ఆవిష్కరణలు కూడా ఆగలేదు. తను దున్నడం ఆపేసి ఆవులను వాడాడు,వాటిని వదిలేసి యంత్రాలు వాడుతున్నాడు. ఆవిష్కరణలు పెరిగేకొద్ది మనిషికి పని తగ్గిపోయింది. కాబట్టి సోమరితనం పెరిగింది, సమయం ఎక్కువ మిగిలింది. ఎక్కువ సమయం మిగిలితే ఉన్న వాటితో తృప్తి పడకుండా అందరి కంటే బాగా ఎదగాలి అనే అత్యాశ పెరిగింది. అత్యాశ పెరిగిందంటే తనకి కావాల్సినదాని కంటే ఎక్కువ పని చేయాలి. అంటే పనిలో నాణ్యత చూసుకోకుండ ఎలా పడితే అలా వృత్తిని దుర్వినియోగం చేసి మరీ తన అత్యాసలు తీర్చుకుంటున్నారు.
ఆశ్చర్యం ఏంటంటే అలా పని చేస్తే దానిని తప్పు పట్టకుండా ఎదుగుదల అని భావిస్తున్నారు. అప్పట్లో ఆదిమానవులకి ఇప్పుడు మానవుడు చేస్తున్న దుర్మార్గాలు,ఆరాచకాలు,అన్యాయాలు తెలిస్తే కచ్చితంగా అతను పచ్చి మాంసమే తినేవాడేమో.
ఏ వృత్తి అయినా మానవుడి అవసారాలను తీర్చటానికి పుట్టిందే. తిండి అవసరం తీర్చటానికి వ్యవసాయం వచ్చింది. జ్ఞానం అవసరం కాబట్టి బడి వచ్చింది, వైద్యం తప్పనిసరి కాబట్టి ఆసుపత్రి వచ్చింది. అవసరం మాత్రమే తీర్చుకునేంతవరకు మనిషి జాతి బాగుంది. కానీ ఎప్పుడైతే అవసరం అత్యాసాగా మారిందో అప్పుడు తిండి,విద్య,వైద్యం అన్నీ వ్యాపారంగా మారాయి. అత్యాశ పనిని పెంచింది. నాణ్యతను మరిచి ఎక్కువ పని చేసి మానవుడు తన జీవన శైలినే మార్చేసుకున్నాడు.
వృత్తి అంటే మానవుడికి ఉపయోగపడేది అయ్యుండాలి. అలాంటిది దురాశ వల్ల పనిలో నాణ్యతా తాగడం వల్ల వృత్తి ధర్మం పుట్టింది. వృత్తి ధర్మం పాటిస్తేనే అక్కడ పని జరిగినట్టు లేదంటే అది కేవలం ఆ మనిషి తన స్వార్ధం తీర్చుకోవటానికే చేసినట్టు. మొదట్లో వృత్తి అంటే తనకోసం,తన కుటుంబం కోసం పని చేసి పోషించుకోవడం. ఇప్పుడు అదే వృత్తి తన కుటుంబంతో సమయం కూడా గడపలేనంత పని నియమాలే వూరత్తి ధర్మం అయిపోయింది. ఈరోజుల్లో ధర్మం కూడా ఎవరికి తగ్గట్టు వాళ్ళు మార్చేసుకుంటున్నారు. అప్పుడు అది అసలు ధర్మం ఎలా అవుతుంది. ఎప్పుడో ఏదో ఒక సాయం చేసిన మనిషికి కృతజ్ఞతలు తెలపుకుంటాము,అదే తన అవసరం రోజు తీర్చే వృత్తికి మాత్రం నిజాయితీగా ఉండలేకపోతున్నాము.
మూడు పూటలు గడిస్తే చాలు అనుకున్న స్థాయి నుండి మూడు తరాలకు సంపాదించి దాచుకోవాలనే దురాశ పుట్టింది. దాని వల్ల రాబోయే తరం వాళ్ళు సోమరులు అవుతున్నారు. వాళ్ళే ఎన్నో ఆస్తులు కూడబెట్టుకొని మిగిలిన ప్రజలకి స్థలం లేకుండా చేస్తున్నారు. మానవుడు తన వికాసం కోసం పరుగులు తీస్తున్నాడను అనుకుంటున్నాడు కానీ తన పై అధికారి విలాసం కోసం చాకిరి చేస్తున్నాడని తెలుసుకోలేకపోతున్నాడు. అక్కడెక్కడో ఉన్న ఆంగ్లేయులు కోసం ఇక్కడ ఉన్న భారతీయులు పని వేళలు అని చూసుకోకుండా రాత్రి పగలు కష్టపడి జీవన చక్రాన్ని నాశనం చేసుకుంటున్నారు.
పని చేస్తున్న అందరూ నిజంగా వాళ్ళ కోసమే పరిగెడుతున్నారని అనుకుంటున్నారు కానీ వేరే వాళ్ళ చేత పని చేయబడుతున్నారు. ఎవరో జీవితాన్ని జీవిస్తున్నారు అనుకుంటున్నారు కానీ వేరే వాళ్ళ జీవితాన్ని నడిపిస్తున్నారు. ఎవరో జీవితం కోసం వీళ్ళు అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆలోచిస్తుంటే వృత్తి ఒకప్పుడు కూడు,గూడు,గుడ్డ కోసం అయితే ఇప్పుడు అవసరంలేని డబ్బు నుండి వచ్చే గుర్తింపు కోసం అయిపోయింది.
మానవుడి పని తీరు ఎలా మారిపోయింది అంటే వాడి అవసరాలు తీర్చుకునే స్థాయి నుండి వాడినే వాడే కోల్పోయే స్థాయికి దిగజారిపోయింది. వాడిని వాడే కోల్పోతే ఇంకేం అవసరాలు ఉంటాయి అని తీర్చుకోవటానికి?
ప్రపంచంలో గొప్ప వృత్తి ఏదంటే వ్యవసాయం. మనకి ప్రతిరోజు అవసరమయ్యే మొదటిది తిండి. ఈ దేశంలో రైతుకి విలువ లేదు, ఆ పంటకి విలువ లేదు. వ్యవసాయం వ్యాపారం చేయటం వల్ల రైతుల బ్రతుక్కి కళంకం వచ్చింది. నేల నుండి పుట్టిన తిండిని కూడా అనుమానించే రోజులివి. ఎందుకంటే ఇక్కడ కూడా అత్యాశ దూరి, వ్యాపారం ఎక్కువ చేయాలంటే కల్తీ చేయక తప్పట్లేదు ఈ మనుషులకి. ఆత్యాస పంటని,కాదు,వ్యవసాయాన్ని కాదు,రైతుని కూడా కాదు ఈ భూమిని కూడా నాశనం చేస్తుంది.
అత్యాశ వల్ల కృత్రిమ ఆహారం ఎక్కువ మోతాదులో పండిస్తున్నారు. ఏదైనా ప్రకృతిని కాదని కృత్రిమంగా వెళితే అది చెడే చేస్తుంది. రైతులు పండించినది సరిగ్గ తింటే ఆసుపత్రికి వెళ్ళే పరస్తితి ఉండేది కాదు.
మనిషికి వైద్యం కూడా తప్పనిసరి. ప్రాణాలు కాపాడే వైద్యుడు మనకి దేవుడితో సమానం. దేవుడు జన్మణిస్తే వైద్యుడు పునర్జన్మనిచ్చేవాడని అంటారు. అంతటి గొప్ప వైద్యంతో కూడా వ్యాపారం చేయగలాడు మనుషుల అత్యాశ. ఒకప్పుడు పసరనీళ్ళతో పోయేది ఇప్పుడు లక్షలు ధారపోస్తే కాని నయం అవ్వటం లేదు. రైతు వ్యాపారం చేయకపోతె ఆసుపత్రికి వెళ్ళే పని ఉండదు. వైద్యుడు వ్యాపారం చేయకపోతె చావుని చూసే పని ఉండదు. దేవుడికి అందరూ సమానమైతే మరి వైద్యుడు ఎందుకని పేడోదికి డబ్బున్నవాడికి ఒకేలా వైద్యం చేయడు?
చివరికి మనిషి అత్యాశ ఎక్కడకు వెళ్ళిన్దంటే శరీరంలో లోపాలను అంగీకరించలేక లేని పోనీ మార్పులు చేయించుకుంటున్నారు.
గురువు అంటే తన శిష్యులకి జ్ఞానాన్ని బోధించి శ్రేష్టమైన మార్గంలో జీవించేలా తీర్చిదిద్దేవాడు. కానీ అదే గురువు నేడు ఏం నేర్పిస్తున్నాడో ఎందుకు నేర్పిస్తున్నాడో కూడా తెలీకుండా విద్య అనే పేరుతో వ్యాపారం మాత్రమే చేస్తున్నాడు. సరైన బోధన శైలి ఉండదు,గురవు లక్షణాలు ఏవి ఉండవు.
రాజుల కాలంలో రాజ్యాన్ని ఒక రాజు జాగ్రత్తగా పరిపాలించేవాడు. అతని నేలని,భాషని,ప్రజలని తరతరాలు కాపుడుకునేలా చూసుకునేవాడు. ఆ రాజ్యం విశిష్టతని కళల రూపంలో కాపాడి చరిత్రలో చాటి చెప్పారు. రాజు దాచే ప్రతి నాణెం రాజ్యానికే. అది నిస్వారదమైన పరిపాలన. నేడు ప్రజల సొమ్ముని సగం రాజకీయవేత్తలే దోచుకుంటున్నారు. సేవ కూడా ఒక వృత్తి రూపంలో చేయగలిగేది రాజకీయం. అత్యాశతో పని చేస్తున్నారు కాబట్టి రాజకీయ నాయకుడు ఒక్కడె బాగుపడుతున్నాడు, నిస్వార్ధంగా పని చేస్తే దేశం బాగుపడుతుంది.
ఇలా ముఖ్యమైన వృత్తులలో మనుషులు వాళ్ళ యొక్క కర్తవ్యనిర్వహన చేయకుండా దేశాన్ని నాశనం చేస్తుంటే అసలు కొన్ని వృత్తులు మనుషులు ఎందుకు సృష్టించుకున్నారో తెలీదు. ఆ వృత్తి యొక్క పరమార్దం ఎంటో తెలీదు. అలా పుట్టిందే అందాల పోటీలు. ఒళ్ళు కనపడేలా శరీరం చూపిస్తూ ఏదో ఆకారం ఉంటేనే అందం అనుకుంటున్నారు. పోటీలో నియమాలు ఎంత వెటకారంగా ఉంటాయి అంటే వాళ్ళకి సహజ పద్దతిలో పుట్టిన వాళ్ళే పోటీ చేయాలి కానీ వాళ్ళ శరీరం మీద కృత్రిమంగా సౌందర్య సాధనాలు వాడుతారు. పెళ్లి అయ్యుండకూడదు,తల్లి అయ్యుండాకూడదు. కానీ అమ్మతనానికి మించిన అందం ఏముంటుంది?
ఈ పోటీ వల్ల మహిళలో ధైర్యం,ప్రతిభ,సమాజాసేవ గుణాలు ప్రతిబింబిస్తాయి అని ప్రచారం చేస్తున్నాయి కానీ నిజానికి అవేవీ కనపడవు. ఆడతానాన్ని నిర్వచించేవి సహజమైన అందం,అమ్మతనం. ఇవి లేని ఈ అందాల పోటీలు ఎందుకో,ఎవరిని ఉద్దరించటానికో? ఈ పోటీలో పాల్గొన్న మహిళళదే ధైర్యం,విశ్వాసం,మానవత్వం అని అంటే, పల్లెటూరిలో పుట్టి అందం లేకపోయినా కష్టపడి వ్యవసాయం చేసుకునే సాదా సీదా అమ్మాయికే ఎక్కువ విశ్వాసం ఉన్నట్టు.
ఒళ్ళు అమ్ముకునే వీళ్ళదే ఆడతనం అయితే, మరి ఒళ్ళు వంచి కష్టపడి పంట పండించే రైతు ఏంటి? ఒళ్ళు వంచిన దానికంటే ఒళ్ళు అమ్మిన దానికే ఎక్కువ విలువ చూపిస్తున్నారు అమాయకపు మనుషులు. వేశ్యలు కూడా ఒళ్ళు చూపిస్తున్నారు, ఈ పోటీలో వాళ్ళు కూడా చూపిస్తున్నారు. వీళ్లిద్దరికి తేడా ఏంటి? వాళ్ళకి సమపాదించే డబ్బులోనా? వాళ్లకున్న గౌరవంలోనా?సమాజం వాళ్ళని చూసే పద్దతిలోనా? లేదా చట్టబద్దమైనదా?
మనుషుల మద్య ప్రవమని ఎవరు భర్తీ చేయలేరు అనుకుంటారు కాని. వాటిని డబ్బు,ఆశ ఎప్పుడో భర్తీ చేసేసాయి. ఇప్పుడు ఎవరు ప్రేమించుకోవటం లేదు. డబ్బు వెనకాల పరిగెడుతున్నారు. మొదట ఆకలి వల్ల డబ్బు కావాలనిపించింది,తర్వాత పరాయివాడి స్థాయి చూసి డబ్బు ఇంకా ఎక్కువ సంపాదించాలనిపించింది,క్రమంగా డబ్బే ఆకలి అయిపోయింది. ఆశ వృత్తిని పుట్టిస్తే అత్యాశ మానవత్వం చంపేసింది. పూరీ గుడేసేలో బ్రతకగాలిగినవాడు పెద్ద అంతస్తులు కట్టాడు. చివరికి మనుషులకి,జంతువులకి కూడా చోటు లేకుండా పోయింది. ఆకుకూరలు తిని వందేళ్లు బ్రతకగలిగినవాడు కృతిమ ఆహారం తింటూ జీవితకాలాన్ని క్షీణించుకుంటున్నాడు. ప్రకృతిలో సౌకర్యంగా బ్రతకాల్సినవాడు కృత్రిమ ప్రపంచంలో ఇరుకుగా బ్రతుకుతున్నాడు. ఇలా సౌకర్యమైన జీవితాన్ని సృష్టించుకున్నాడు అనే భ్రమలో మానవుడు సోమరితనంగా సాంకేతిక జీవితంలో పరిగెడుతున్నాడు. ఇలానే ఉంటే అనుబంధాల మధ్య నడవాల్సిన మనిషి యంత్రాల చుట్టూ తిరుగుతూ వాటితోనే కాపురం చేస్తూ ఉంటే తరువాత మానవ జాయతే యంత్రాలతో భర్తీ అయిపోతుంది.
కాలిన చిన్న మాంసపు ముద్ద తినటం వల్ల మనిషి జాతే అంతరించిపోయే పరిస్థితికి వచ్చింది.